కేసీఆర్ సభను పట్టించుకున్న నాథుడే లేడు : బండి సంజయ్

-

ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ సభను ఎవరూ పట్టించుకోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. సభకు వచ్చిన జనాలు, నేతలు ఎవరూ మనస్పూర్తిగా పాల్గొనలేదని చెప్పారు. నిన్న జనం ఫోకస్ అంతా ఇండియా- న్యూజిలాండ్‌ మ్యాచ్‌ పైనే ఉందన్నారు. ఆలయాలపై ఖర్చు చేస్తే.. హుండీ ఆదాయం వస్తుందని సభకొచ్చిన ఇతర రాష్ట్రాల సీఎంలకు కేసీఆర్‌ చెప్పారా అని ప్రశ్నించారు.

గోదావరి, కృష్ణ నదుల్లో జలాల్ని పూర్తిగా ఉపయోగించు కోవాలన్న ఆలోచన చేయని కేసీఆర్‌ దేశంలో 5వేల టీఎంసీల జలాశయాల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం ఎందుకు 4వ స్థానంలో ఉందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నట్లు నిరూపిస్తారా అని సవాలు చేశారు. కేసీఆర్‌ మాటలను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని కొట్టిపడేశారు. మహిళలకు 35శాతం రిజర్వేషన్‌ అంటున్న కేసీఆర్‌… తన మంత్రివర్గంలో ఎంతమంది మహిళలకు చోటిచ్చారో గుర్తు చేసుకోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version