నా మీద కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు: బండి సంజయ్

-

ఎప్పుడూ కూడా పదవీ కాలాన్ని ఆస్తులు సంపాదించడానికి వాడుకోలేదని ప్రతిక్షణం ప్రజల కోసమే పోరాడడానికి సమయాన్ని వెచ్చించాలని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ప్రతి నిమిషం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి కోసమే పని చేశానని మీరంతా మేధావులు నేనేం చేసానో కాంగ్రెస్ బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏం చేశారో మీరే బేరీజు వేసి ప్రజలకు వివరించాలని కోరుతున్నానని న్యాయవాదుల్ని ఆయన కోరారు.

బండి సంజయ్ కుమార్ స్థానిక బార్ అసోసియేషన్ నాయకుల్ని కలిశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చేసిన అభివృద్ధికి తెచ్చిన నిధులతో పాటు ప్రజల పక్షాన చేసిన పోరాటాలని వివరించారు ఎంపీగా గత ఐదేళ్లలో 12వేల కోట్ల నిధులను తీసుకువచ్చానని జాతీయ రహదారుల నిర్మాణానికి 5 వేల కోట్లు గ్రామాల్లో రోడ్లు మౌలిక సదుపాయాల కల్పనకి వందల కోట్లు తీసుకువచ్చానని కానీ కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version