కేసీఆర్ ను తరిమికొడతాం: బండి సంజయ్

-

బీజేపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జగత్ ప్రకాశ్ నడ్డా సంగారెడ్డిలో బీజేపీ జిల్లా కార్యాలయాన్ని వర్చువల్ గా ప్రారంభించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కార్యాలయంతో పాటు మరో ఐదు జిల్లాల్లో కార్యాలయాలను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో రాచరిక పాలన సాగిస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొడతామని అన్నారు. బీజేపీకి బలం, బలగం కార్యకర్తలేనని వెల్లడించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీదే గెలుపుని స్పష్టం చేశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీ పార్టీ వరుసగా విజయాలు సాధిస్తూనే ఉందన్నారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం రాబోతుందని వెల్లడించారు బండి సంజయ్. కుటుంబ పాలన నడుస్తోందని తన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీ.ఎస్.పీ.ఎస్.సీ ప్రశ్నాపత్రం లీకేజీతో దాదాపు 30లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం పరీక్షలు సక్రమంగా నిర్వహించలేని దుస్థితిలో ఉందా అంటూ హేళన చేశారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను వెంటనే ప్రక్షాళన చెయాలని, ప్రస్తుత సభ్యులను తొలగించి నూతన సభ్యులను నియమించాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలన్నారు. ట్విట్టర్ టిల్లూ కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. పరువు లేని కూడా తన మీద పరువు నష్టం కేసు వేశారని ఆరోపించారు. కేటీఆర్.. మోదీని బ్రోకర్ అనే ముందు మీ నాన్న పాస్ పోర్ట్ బ్రోకర్ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తపరిచారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version