సర్దార్ పటేల్ లేకుంటే తెలంగాణ ఏర్పడేదే కాదు : బండి సంజయ్

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్ పై మరోసారి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలపడానికి ఎంతో కష్టపడ్డ సర్దార్ వల్లభాయ్ పటేల్ అని గుర్తు చేశారు. అసలు సర్దార్ పటేల్ లేకుంటే తెలంగాణ ఏర్పడదే కాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. పటేల్ జయంతి రోజున కెసిఆర్ ఎందుకు పాల్గొనలేదో, ఆయన బిజీ షెడ్యూలును ప్రజలకు తెలియజేయాలన్నారు.

నైజాం నవాబు పాలించిన హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలుపకుంటే చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి అయ్యే వాడా…? చంద్రశేఖర్ రావు పేరు చాందు పాషా గా ఉండేదని ఎద్దేవా చేశారు బండి సంజయ్. నిన్న జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో గెలవ పోతున్నాం అని జోస్యం చెప్పారు బండి సంజయ్.. టిఆర్ఎస్ నాయకులు అధికారం అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి ఎన్నికల్లో ఓటుకు ఆరు వేల నుండి పదివేల వరకు ఖర్చు పెట్టారని మండిపడ్డారు

Read more RELATED
Recommended to you

Exit mobile version