ఎండలో అన్నదాతలు.. మొద్దు నిద్రలో రేవంత్ సర్కార్ : హరీశ్ రావు

-

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు రైతులు ఎరువుల కోసం మండుటెండల్లో నిలబడుతుంటే రేవంత్ ప్రభుత్వం మొద్దు నిద్రలో జోగుతుందన్నారు. మొన్న మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ కోసం పోలీసులు టోకెన్లు జారీ చేస్తే, నేడు జగిత్యాలలో రైతులు పాస్ బుక్కులు, ఆధార్ కార్డులను క్యూలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఉమ్మడి రాష్ట్రంలోని రైతుల కన్నీళ్ల కడగండ్లను మరోైసారి పునరావృతం చేస్తున్నదని గుర్తుచేశారు.

బీఆర్ఎస్ పాలనలో రైతే రాజుగా ఉన్న తెలంగాణలో రైతన్నను నట్టేట ముంచి, నడి రోడ్డు మీదకు తెచ్చిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని విమర్శించారు. రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు. యూరియా కోసం రైతులు మండుటెండల్లో తంటాలు పడుతుంటే, ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండటం దుర్మార్గం అని నిలదీశారు. రైతు డిక్లరేషన్ అని దగా చేసి, రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్ పేరుతో మోసం చేసారని గుర్తుచేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version