కేసీఆర్‌ నెత్తి మీద శని ఉంది..చంద్రబాబుకు పట్టిన గతే పడుతుంది : బండి సంజయ్

-

సీఎం కేసీఆర్‌ నెత్తి మీద శని ఉందని.. టీడీపీ అధినేత చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని ఆయనకు పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. థర్డ్‌ ఫ్రంట్‌ పేరుతో కేసీఆర్ మళ్ళీ కొత్త నాటకానికి తెరలేపాడని ఆగ్రహించారు. అవినీతి రహిత ప్రభుత్వం మోడీ నాయకత్వంలో నడుస్తుందని చిన్న జీయర్ అన్నారని.. మేడారం అభివృద్ధి జరగలేదు కాబట్టే- మొఖం చూపించలేఖ వెళ్ళలేదని ఎద్దేవా చేశారు.

గవర్నర్ వెళ్తే అధికారులు ఎవ్వరూ వెళ్ళొద్దని ప్రగతి భవన్ నుంచి ఆదేశాలు ఇచ్చారని… చంద్రబాబు కు పట్టిన గతే కేసీఆర్ కు పట్టబోతోందన్నారు. గతంలో చంద్రబాబు కూడా దేశం అంతా తిరిగిండు- ఇప్పుడు ఆయనే కనుమరుగయ్యాడని.. తుకుడే గ్యాంగ్ లీడర్ ను ఎందుకు కేసీఆర్ వెంట తీసుకెళ్లాడు ? అని ప్రశ్నించారు.

గతంలో ప్రాంతీయ పార్టీలే ముఖ్యం అన్న కేసీఆర్- ఇవ్వాళ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా అంటున్నారని… మొదట్లో గవర్నర్ ను మెచ్చుకున్నా ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకు దూరం పెడుతున్నారు? అని మండిపడ్డారు. ఎలాంటి బావజాలాలు లేని వ్యక్తి సీఎం కేసీఆర్ అని.. బీజేపీ చేపట్టిన ఉద్యమాల వల్లే సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయట తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version