కేసీఆర్ మాకు ఓ అస్త్రం..కచ్చితంగా గుణపాఠం చెబుతాం : బండి సంజయ్‌

-

కేసీఆర్ మాకు ఓ అస్త్రం..కచ్చితంగా గుణపాఠం చెబుతామని బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం కేసీఆర్ చేసిన వాఖ్యలపై బిజెపి ఆందోళనలు చేసున్నారని.. రాజ్యాంగం వల్ల ఇబ్బందులేంటో కేసీఆర్ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి దిగి వచ్చేవరకు గుణపాఠం చెప్తామని… ప్రధాని కాంగ్రెస్ ను విమర్శిస్తే, టీఆరెస్ ఎందుకు స్పందిస్తోందన్నారు.

కాంగ్రెస్ చేసిన అనర్ధాలను ప్రధాని మోడీ వివరించారని.. కాంగ్రెస్ నాయకులు పెప్పర్ స్ప్రే కొట్టిన , సుష్మాజీ బయపడలేదని గుర్తు చేశారు. పార్లమెంట్ లో విభజన బిల్ సమయం లో కేసీఆర్ ఎక్కడ ఉన్నారు… కేసీఆర్ దొంగ దీక్షలు చేశారని నిప్పులు చెరిగారు.

తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ పక్కన పెట్టారు.. కృష్ణా జిల్లాల్లో 279 టీఎంసీల కోసం సంతకం కేసీఆర్ ఎందుకు సంతకం పెట్టాడని ఆగ్రహించారు. కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా, బాబా సాహెబ్ రచించిన రాజ్యాంగం కావాలా.. అని నిలదీశారు. మోడీని తిడితే అదే స్థాయిలో అడ్డుకుంటామని.. మోడీ విభజన ను తప్పు పట్టటం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version