ఉత్తరప్రదేశ్ సీఎంను కలిసిన బండ్ల గణేష్..ఫోటో వైరల్

-

టాలీవుడ్‌ బడా నిర్మాత, రాజకీయ నాయకులు బండ్ల గణేష్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా తెలుసు. ఒకప్పుడు సినిమా ఫంక్షన్ల వేదికలపై మాట్లాడిన స్పీచులు గుర్తుకు వచ్చేవి. ఇప్పుడైతే రాజకీయాల్లోకి మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తాయి. రాజకీయాల్లోకి దిగి.. కోటలు దాటే మాటలతో నవ్వుల పాలయ్యాడు. బండ్ల గణేష్ కాస్తా.. బ్లేడ్ గణేష్ అనే స్థాయికి దిగజారిపోయాడు.

అదంతా కాసేపు పక్కకు పెడితే..తాజాగా.. ఉత్తర ప్రదేశ్‌ కు వరుసగా రెండో సారి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన యోగి ఆదిత్య నాథ్‌ తో కలిసి ఫోటో దిగారు బండ్ల గణేష్‌. ఆ ఫోటో ను తన ట్విట్టర్‌ లో స్వయంగా బండ్ల గణేష్‌ పోస్టు చేశారు.

యూపీకి వరుసగా రెండో సారి ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్య నాథ్‌ కు శుభాకాంక్షలు తెలిపన బండ్ల గణేష్.. శివుడు ఆయనకు ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ప్రసాదించాలని కోరారు. ఈ ఫోటోను చూసిన వారు బండ్ల గణేష్‌.. రాజకీయంగా బాగా ఎదిగి పోయారంటూ కామెంట్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version