తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 28న ఎల్బీ స్టేడియంలో 10 వేల మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు జిల్లాల్లోని ముఖ్య ఆలయాలు, పర్యాటక ప్రదేశాల్లో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు మంత్రి జూపల్లి కృష్ణారావు.

ట్యాంక్ బండ్ దగ్గర సెప్టెంబర్ 27న బతుకమ్మ కార్నివాల్ ఈవెనింగ్ ఉంటుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 29న పీపుల్స్ ప్లాజాలో ఉత్తమ బతుకమ్మ పోటీ వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు మంత్రి జూపల్లి కృష్ణారావు.
కాగా గులాబీ పార్టీ నేతలపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. వాళ్ల తప్పులను బయటికి తీసిన ప్రతిసారి తెలంగాణ అనే పదాన్ని తీస్తారు. వాళ్లు ప్రమాదంలో ఉన్నప్పుడల్లా తెలంగాణను తీస్తారు. పార్టీ పేరులోనుంచి తెలంగాణనే తొలగించారన్నారు.