ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ సీఎం !

-

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, వైసీపీ నేతలు బీజేపీలో చేరబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, వైసీపీకి చెందిన మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీతో చర్చలు జరుపుతున్నారని అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే వారి పేర్లను వెల్లడిస్తామన్నారు. బీసీలను సీఎం చేసే దమ్ము చంద్రబాబు, జగన్‌కు ఉందా అని ప్రశ్నించారు. బీసీలను ముఖ్యమంత్రిని చేసే దమ్ము బీజేపీకి ఉందని అన్నారు. 

హోంమంత్రి అంటే చంద్రబాబు ఇంటికి కాదన్న విషయాన్ని అచ్చెన్నాయుడు తెలుసుకోవాలని చురకలు వేశారు.  అభివృద్ధి ద్వారా ఏపీ రూపురేఖలు పూర్తిగా మార్చాలన్నదే తమ తపన అని అన్నారు సోమువీర్రాజు. ఇక ఈ అంశం మీద ఏపీ మంత్రి పినిపె విశ్వరూప్ కీలక వ్యాఖ్యలు చేశారు.  బీసీలను సీఎం చేస్తామని బీజేపీ చెప్పడం సంతోషంగా ఉందన్న ఆయన రాజకీయంగా ఏపీలో బీజేపీ స్థాయేంటీ.. బలమేంటీ..? అనేది చూసుకోవాలని అన్నారు. రాజకీయంగా బీజేపీకి ఏపీలో అవకాశం లేదు కాబట్టి.. బీసీను సీఎం చేస్తామని చెప్పారని ఆయన అన్నారు.  

Read more RELATED
Recommended to you

Exit mobile version