BREAKING : ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారం ప్రారంభం..మొదట అంబటి రాంబాబు ప్రమాణం !

-

BREAKING : ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారం ప్రారంభం కాసేపటి క్రితమే ప్రారంభం అయింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ విశ్వ భూషణ్‌ తో పాటు.. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి… ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరిద్దరూ వచ్చిన అనంతరం.. జాతీయ గీతం ఆలపించారు.

గవర్నర్‌ విశ్వభూషణ్‌ ఆధ్వర్యంలో.. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగుతోంది. ఇక ఏపీ కొత్త కేబినేట్‌ మంత్రులలో… అంబటి రాంబాబు.. మంత్రిగా మొదటగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఏపీ మంత్రి గా అంజాద్‌ బాషా ప్రమాణ స్వీకారం చేశారు. అంజాద్ భాషా అనంతరం… ఆదిమూలపు సురేష్‌, బొత్స సత్య నారాయణ, ముత్యాల నాయుడు, బుగ్గన రాజేంద్ర నాథ్‌ రెడ్డి, సీ హెచ్‌ వేణుగోపాల కృష్ణ,దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్‌ నాథ్‌, గుమ్మ నూరు జయరాం, జోగి రమేష్  ప్రమాణం స్వీకారం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version