తెలంగాణాలో కేసీఆర్ కు “బై … బై”: భట్టి విక్రమార్క

-

తెలంగాణాలో ప్రస్తుతం అధికారంలో ఉన్న BRS ను ఓడించడానికి విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. గత రెండు ఎన్నికలలో వరుసగా గెలిచి అధికారంలో ఉన్న కేసీఆర్ కు మరోసారి అదృష్టం కలిసి వస్తుందా లేదా అన్నది ఎన్నికలు ముగిసే వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా తాజాగా సి ఎల్ పి నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణాలో కేసీఆర్ ను నమ్మే ప్రజలు ఎవరూ లేరని చెప్పారు, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. ఇక భట్టి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు 74 నుండి 78 సీట్లు వస్తాయని ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఈ ఎన్నికలలో కేసీఆర్ పప్పులేమీ ఉడకవు… ప్రజలు పట్టం కట్టబోయేది కాంగ్రెస్ పార్టీకే నంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భట్టి విక్రమార్క. ఇక కేసీఆర్ ను కూడా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు, గెలుపు కోసం ఏమి చేయడానికి అయినా సిద్ధం అని తెలిసిందే.

మరి కాంగ్రెస్ నేత భట్టి చెప్పినట్లుగా కేసీఆర్ గెలవడం అసాధ్యమేనా అన్నది తెలియాలంటే ఎన్నికలు ముగిసే వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version