ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్‌ కు బిగ్‌ షాక్‌

-

ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్‌ కు బిగ్‌ షాక్‌ తగిలింది. మూడు ఈశన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రిలీజ్‌ అవుతున్నాయి. ఇక మేఘాలయలో కాంగ్రెస్ కు తీవ్ర పరాభవం ఎదురైంది. 17 స్థానాలను కోల్పోయిన కాంగ్రెస్.. నాగాలాండ్ లో ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది. త్రిపురలో 4 స్థానాలకు కాంగ్రెస్‌ పరిమితం అయింది.

అటు త్రిపురలో బీజేపీ కూటమి 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్‌- వామపక్షాల కూటమి 19 చోట్ల ముందంజలో ఉంది. టీఎంపీ (తిప్రా మోథ్రా పార్టీ) 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. నాగాలాండ్‌లో బీజేపీ-ఎన్‌డీపీపీ కూటమి స్పష్టమైన ఆధిక్యం సంపాదించింది. ఇప్పటి వరకు ఈ కూటమి ఒక చోట విజయం సాధించగా.. మరో 48 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎన్‌పీఎఫ్‌ 6, కాంగ్రెస్‌ 1, ఎన్‌పీపీ 3, ఇతరులు ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు.మరోవైపు మేఘాలయలో హంగ్ ప్రభుత్వం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లను పరిశీలిస్తే మేఘాలయలో ఇప్పటి వరకు ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version