సురేష్ బాబు, హీరో దగ్గుబాటి రానాలపై క్రిమినల్ కేసు.. సమన్లు జారీ చేసిన కోర్టు

-

టాలీవుడ్‌ సినీ నిర్మాత సురేష్ బాబు, హీరో దగ్గుబాటి రానాలకు బిగ్‌ షాక్‌ తగిలింది. సినీ నిర్మాత సురేష్ బాబు, హీరో దగ్గుబాటి రానా మీద క్రిమినల్ కేసు నమోదు అయింది. ఫిలిం నగర్ లాండ్ వివాదంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. దౌర్జన్యంగా తమను రౌడీల సాయంతో ఖాళీ చేయించారని ప్రమోద్ కుమార్ అనే వ్యాపారి ఫిర్యాదు చేశాడు.

ఖాళీ చేయకపోతే అంతు చూస్తామని సురేష్ బాబు బెదిరింపులకు దిగినట్లు ఫిర్యాదు చేశాడు. అయితే, అతను ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు బంజారా హిల్స్ పోలీసులు. దీంతో బాదితుడు…కోర్టును ఆశ్రయించాడు. ఈ తరుణంలోనే, పోలీసులతో సంబంధం లేకుండా నేరుగా సురేష్ బాబు, దగ్గుబాటి రానా తో సహా మరి కొంతమందిపై కేసు నమోదు చేసింది నాంపల్లి కోర్టు. విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది నాంపల్లి కోర్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version