బిగ్ బాస్: 8 వారాలకు గానూ ఆర్.జె.సూర్య పారితోషకం అన్ని రూ.లక్షలా?

-

తెలుగులో బిగ్ బాస్ ఆరవ సీజన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. తెలుగులో అత్యధిక రేటింగ్స్ సొంతం చేసుకుంటూ దేశంలోనే నెంబర్ వన్ షోగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఆరవ సీజన్లో భాగంగా ఎనిమిదవ వారానికి సంబంధించి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్న ఆర్జే సూర్య ఎలిమినేట్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే అతడు ఈ సీజన్ కోసం ఎంత పారితోషకం తీసుకున్నాడు అనే విషయం ఒకసారి చదివి తెలుసుకుందాం.

బిగ్ బాస్ ఆరో సీజన్లోకి రికార్డు స్థాయిలో ఏకంగా 21 మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్ లుగా ఎంటర్ అయ్యారు. వీరంతా కూడా తమ తమ విభాగాలలో ఎనలేని క్రేజ్ ను కూడా సంపాదించుకున్నారు. అందులో కొంతమంది మాత్రమే అందరి దృష్టిలో పడ్డారని చెప్పవచ్చు. వారిలో ఫేమస్ ఆర్ జె, మిమిక్రీ ఆర్టిస్ట్ అయిన సూర్య కూడా ఒకరు.. ఆరంభంలోనే తనదైన టాలెంట్ తో మెప్పించిన సూర్య ఖచ్చితంగా టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకుంటాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఈయన చేసిన కొన్ని పనుల వల్ల బిగ్ బాస్ ఎలిమినేట్ చేశాడు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

మొదట్లో షో లో ఇచ్చే టాస్కుల్లో ఎంతో యాక్టివ్ గా పాల్గొనేవాడు. అలాగే పెద్దగా ఎవరితో కూడా గొడవలు పడకుండా కామ్ గా కనిపించేవాడు. అందుకే ఆర్జే సూర్యను అందరూ సౌమ్యుడు అని పిలిచేవారు. ఈ క్రమంలోనే మొదట్లో భారీ స్థాయిలో ప్రేక్షకుల నుంచి మద్దతు కూడా లభించింది. కానీ ఇతను చేసిన పులిహోర కార్యక్రమాలు ఇతడిని పూర్తిగా దెబ్బతీసాయని చెప్పవచ్చు. మొదట్లో ఆరోహితో ప్రేమాయణం బెడిసి కొట్టింది. ఆమె బయటకు వెళ్ళగానే ఇనయా సుల్తానా తో జతకట్టాడు. ఆమె కూడా అతడికి బాగా కోఆపరేట్ చేస్తూ రెచ్చిపోయింది . దీంతో వీరిద్దరి రొమాన్స్ తట్టుకోలేక షో నుంచి బయటకు పంపించేశారు.

శనివారం జరిగిన ఎపిసోడ్ లో ఎనిమిదో వారానికి గాను ఆర్జె సూర్య ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున వెల్లడించారు. 8 వారాలపాటు ఉన్న ఆర్జే సూర్య ఎంత పారితోషకం తీసుకున్నాడు అనే విషయానికి వస్తే సూర్య రోజుకు రూ.27 వేల చొప్పున వారానికి రూ.1.89 లక్షలు తీసుకున్నాడు. మరి ఎనిమిది వారాలపాటు ఉన్నందుకుగాను రూ.15.12 లక్షలు పారితోషకం తీసుకున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version