T20 World Cup 2022 : భారత్ X సౌతాఫ్రికా మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు…!

-

టి20 ప్రపంచ కప్ లో ఆదివారం సూపర్ గ్రూప్-12 లో టీమిండియా పై సౌతఫ్రికా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రోటీస్ విజయంతో పాకిస్తాన్ అనధికారికంగా t20 ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించినట్లే, టీమిండియా, సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కు ముందు నెదర్లాండ్స్ ను చిత్తు చేసిన పాకిస్తాన్ ను ఆ సంతోషం ఒక్కరోజు కూడా మిగల్లేదు. సౌత్ ఆఫ్రికా పై టీమ్ ఇండియా గెలవాలని పాక్ అభిమానులు చేసిన ప్రార్థనలు ఫలించలేదని చెప్పొచ్చు.

ఇక భారత్-పాక్ మ్యాచ్ ఫిక్స్ అయిందని కూడా ఆరోపిస్తున్నారు. సూపర్ ఫామ్ లో ఉన్న భారత టాప్-5 బ్యాటర్లు దారుణంగా విఫలం అవ్వడం, చేతిలోకి వచ్చిన సునాయాస క్యాచ్ లను నేలపాలు చేయడం, ఈజీ రనౌట్లను చేయలేకపోవడమే ఫిక్సింగ్ కు సాక్షాలని పేర్కొంటున్నారు. భారత్-సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ను చాలా ఆసక్తిగా గమనించిన పాకిస్తాన్ అభిమానులు, భారత్ ఓటమిని తట్టుకోలేకపోతున్నారు. పాకిస్తాన్ ను అడ్డుకోవాలననే కుట్రతోనే భారత్ ఈ మ్యాచ్ ను తేలికగా తీసుకుందని, పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా లేదని తెలిసి కూడా నిర్లక్ష్యపు షాట్లతో వికెట్లు పారేసుకున్నారని మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version