బైక్ స్కిడ్.. బోర్‌వెల్ కింద పడి యువకుడి దుర్మరణం

-

అతివేగం ఓ యువకుడి ప్రాణాలను బలిగొన్నది. వేగంగా వెళ్లే క్రమంలో బైక్ అదుపుతప్పడంతో బోర్‌వెల్ లారీ కింద పడి యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తోరూర్ పట్టణ కేంద్రంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మేడ్చల్ జిల్లా సూరారంనకు చెందిన కూన వరుణ్(20)తన స్నేహితుడు సూర్యతో కలిసి హైదారాబాద్ నుండి ఖమ్మంకు వెళ్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారి మీదుగా తొర్రూరు పట్టణం ప్రభుత్వ పాఠశాల సమీపంలోకి రాగానే ద్విచక్ర వాహనం అదుపుతప్పింది. దీంతో స్నేహితులు ఇద్దరు కింద పడిపోయారు.సరిగ్గా అదే టైంలో అటుగా వచ్చిన బోర్‌వెల్ లారీ మీద నుంచి వెళ్లడంతో వరుణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, మృతుడు ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. వరుణ్ స్నేహితుడు సూర్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version