హైదరాబాద్ లో బీజేపీ, జనసేన ముఖ్య నేతల భేటీ

-

హైదరాబాద్ లో జనసేన, బీజేపీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. బిజెపి తరఫున మురళీధరరావు అలాగే పురంధరేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హాజరయ్యారు. ఇక జనసేన తరపున పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇద్దరూ హాజరయ్యారు. తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి ఎంపికపై కొద్ది రోజుల నుంచి ఈ రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి.

ఈరోజు అయినా ఈ అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. అయితే ఎవరు పోటీ చేస్తారు అనే అంశం మీద ఎవరూ క్లారిటీ ఇవ్వలేక పోతున్నారు. ఎవరు పోటీ చేసినా కలిసి పని చేస్తామని అటు సోము వీర్రాజు అలానే పవన్ కళ్యాణ్ ఇద్దరూ చెబుతున్నారు. నిన్న రాత్రి కూడా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళిన సోము వీర్రాజు ఈ అంశానికి సంబంధించి చర్చలు జరిపారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version