నల్గొండలో డబుల్ మర్డర్ కలకలం

-

నల్గొండ పట్టణంలోని రాం నగర్ లో డబుల్ మర్డర్ కలకలం రేపాయి. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను దుండగులు బండరాళ్లతో కొట్టి చంపారు. ఘటనా స్థలానికి చేరుకుని టూ టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. ఇక ఘటనా స్థలంలో మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే మృతులు ఇతర రాష్ట్రానికి చెందినవారిగా పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మృతులు ఏ రాష్ట్రానికి చెందినవారు అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటన పట్టణంలో సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్థానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version