తెలంగాణ పై బీజేపీ స్పెషల్ ఫోకస్..!

-

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ మీద బిజెపి స్పెషల్ ఫోకస్ అయితే పెట్టేసింది ఈ క్రమంలోనే బిజెపి అగ్ర నేతలు తెలంగాణలో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రేపు బిజెపి అగ్ర నేతకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకి రాబోతున్నారు. హైదరాబాదులోని ఎల్బి స్టేడియంలో బిజెపి నేతలతో సమావేశం అవబోతున్నారు. ఈనెల 15 నుండి దక్షిణాది రాష్ట్రాల్లో మోడీ పర్యటనలు చేయబోతున్నారు.

మార్చి 16 18 19 తేదీల్లో ప్రధాని తెలంగాణలో పర్యటించే అవకాశం కనబడుతోంది మూడు రోజుల్లో మూడు భారీ బహిరంగ సభల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. జగిత్యాలలో నాగర్ కర్నూల్ మల్కాజ్గిరి లో ప్రధాని మోడీ సభలకి స్టేట్ యూనిట్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది మెజారిటీ ఎంపీ సీట్లు లక్ష్యంగా అన్ని పార్లమెంట్ స్థానాలని టచ్ చేసేలాగా మూడు లోక్సభ స్థానాలని కవర్ చేస్తూ సభ పెట్టాలని బిజెపి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version