మూడు నెలలు మండిపోబోతున్న ఎండలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!

-

ఈసారి ఎండాకాలం వచ్చేస్తోంది. ఎండలు ఫిబ్రవరి నెలలోనే వచ్చేసాయి. ఏసీలు కూలర్లు ఫ్రిజ్లని ఫ్యాన్లని బాగా అందరూ ఉపయోగిస్తున్నారు. ఎండాకాలం రావడం వలన కరెంటు బిల్లు కూడా ఎక్కువగా వస్తుంది ఇక ఇది ఇలా ఉంటే వచ్చే మూడు నెలల్లో వేడి గాలులు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ఎండ తీవ్రత వలన డిహైడ్రేషన్ సన్ స్ట్రోక్ వంటివి రాకుండా చూసుకోవాలని వాతావరణ శాఖ చెప్తోంది.

తలనొప్పి వంటి అనేక వ్యాధులు ఎండ వలన తలెత్తుతాయి అని ఆరోగ్య నిపుణులు సోషల్ మీడియాలో సలహాలు కూడా ఇస్తున్నారు. భగ్గుమంటున్న భానుడు నుండి విముక్తిని పొందే చిట్కాలు చూసి పాటించండి. వీలైనంతవరకు సాయంత్రం పూట మాత్రమే బయటికి వచ్చే విధంగా చూసుకోండి ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండండి బాడీని చల్లగా మార్చే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version