బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి విమర్శలు…

-

తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ నేత వివేక్ నేడు మంచిర్యాల జిల్లా మందమర్రిలో మీడియాతో ఈ నేపథ్యంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై వివేక్ వెంకటస్వామి తీవ్ర విమర్శలు చేశారు. కవిత ‘లిక్కర్ క్వీన్’ అని ఆరోపించారు. 800 షాపులకు కవితనే లిక్కర్ సరఫరా చేశారని ఎద్దేవా చేశారు. లిక్కర్ పాలసీలో భాగంగా 32 రూపాయలుగా ఉన్న కమీషన్ ను 340 రూపాయలకు పెంచారని చెప్పారు.

రాష్ట్రం ఏర్పాడ్డాక కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని వివేక్ ఆరోపించారు. కేసీఆర్ అంటే కల్వకుంట్ల కమిషన్ రావుని విమర్శించారు. ప్రజల బతుకులను ఆగం చేసిన బీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారు. మిషన్ భగీరథ పథకంలో రూ.40 వేల కోట్లు మేఘా కృష్ణారెడ్డితో కలిసి కేసీఆర్ దోచుకున్నారని ఆరోపించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version