బిజెపి నాయకులకు దమ్ముంటే విభజన హామీలు నెరవేర్చాలి – వినయ్ భాస్కర్

-

బిజెపి నాయకులకు దమ్ముంటే విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్. హనుమకొండ లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఖమ్మంలో నిన్నటి బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు. తెలంగాణలో కేసీఆర్ పాలనను వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మెచ్చుకున్నారని తెలిపారు.

బిజెపి నాయకుల కంటికి పొరలు వచ్చి రాష్ట్ర అభివృద్ధి కనబడడం లేదని.. మీరు కంటి వెలుగు స్కీం లో పరీక్షలు చేయించుకుంటే మంచిదని సూచించారు. 380 రోజుల తర్వాత బిజెపి కనపడదన్నారు. రాబోయేది కెసిఆర్ సర్కార్ అని ధీమా వ్యక్తం చేశారు. ఆరూరి రమేష్ మాట్లాడుతూ.. నిన్నటి జన సందోహాన్ని చూసి బిజెపి వాళ్లు ఏం మాట్లాడుతున్నారు అర్థం కావడం లేదన్నారు. కెసిఆర్ కు వచ్చే సపోర్టు చూసి బిజెపి వాళ్లు వణుకుతున్నారని అన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇలాంటి పథకాలు ఎవరు ప్రవేశపెట్టలేదన్నారు ఆరూరి రమేష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version