మూడు పార్టీలు మారి.. ఢిల్లీకి కప్పం కట్టి సీఎం కుర్చీ తెచ్చుకున్నాడు రేవంత్. కానీ పుట్టినప్పుడే కాషాయ జెండాను ముద్దాడిన వ్యక్తి కిషన్ రెడ్డి అని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. కిషన్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు రేవంత్ కు లేదు. ఎమ్మెల్యే, ఎంపీగా, కేంద్రమంత్రిగా నిజాయితీతో పనిచేసిన మచ్చలేని వ్యక్తి కిషన్ రెడ్డి. వచ్చే ఎన్నికల నాటికి రేవంత్ ఏ పార్టీలో ఉంటాడో తెలీదు. రానున్న ఎన్నికల్లో రేవంత్ కి గట్టి సమాధానం చెబుతాం. రాబార్ట్ వాద్రా కోసం మూసీ ప్రాజెక్టు చెపడితే మేమేందుకు నిధులు ఇస్తాం.
అవినీతి ప్రాజెక్టులు తప్పా ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చడం లేదు. తెలంగాణ నిధులు ఇచ్చి ఆదుకుంటున్నది కేంద్రప్రభుత్వమే. ఆయనతో ఉన్న ఎమ్మెల్యేలే ఆయన్ను పట్టించుకోవడం లేదు. ఇది సీఎం స్థాయికి చాలా సిగ్గు చేటు. రేవంత్ రెడ్డి బ్రదర్స్ దండుకోవడానికి rrr దక్షిణ భాగం అలైన్మెంట్ మార్చాలని చూస్తున్నారు. నల్లగొండ మంత్రులు దీనికి ప్లాన్ చేశారు. పేద ప్రజల భూమి పోయేలా అలైన్మెంట్ మార్చాలని వెళ్తే కేంద్రం ఒప్పుకోలేదు. రేవంత్.. చేతకాని, చేవ లేని ముఖ్యమంత్రి. కనీసం కేబినెట్ కూడా విస్తరణ చేపట్టలేని స్థితిలో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించలేని స్థితిలో ఉన్నారు అని రాకేష్ రెడ్డి పేర్కొన్నారు.