తెలంగాణపై బీజేపీ ఫోకస్‌..ఎన్నికల వరకు కార్యక్రమాలు ఇవే

-

తెలంగాణపై బీజేపీ ఫోకస్‌ చేసింది. బీజేపీ భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించింది. ఎన్నికల వరకు బీజేపీ కార్యక్రమ ఎజెండాను రూపొందించింది. నిరంతరం ప్రజల్లో ఉండాలని బీజేపీ ప్లాన్‌ చేసింది. కెసిఆర్ వైఫల్యాలు, మోడీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల తో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకుంది. మే లో మోడీ 9 ఏళ్ల పాలన పై విస్తృత ప్రచారం చేస్తోంది. ఏప్రిల్ 8 న మోడీ రాష్ట్ర పర్యటించనున్నారు.

ఏప్రిల్ 10 లోపు బూత్ సశక్తి కరణ్ అభియాన్ పూర్తి చేయాలని.. ఏప్రిల్ 30 న మోడీ మన్ కి బాత్ ప్రతి అసెంబ్లీ లో వంద కేంద్రాల్లో కార్యక్రమం నిర్వహించనుంది. మే రెండో వారం లో ప్రతి అసెంబ్లీ లో 500 మంది ముఖ్య కార్యకర్తలతో సమ్మేళనాలు ఏర్పాటు చేయనుంది. జూన్, జూలై లో సాలు దొర సెలవు దొర పేరుతో కెసిఆర్ వైఫల్యాలు పై ఇంటింటికీ బీజేపీ వెళ్లనుంది. ఆగస్ట్, సెప్టెంబర్ లో కమ్యూనిటీ మీటింగ్స్ (సామాజిక, మహిళ, యూత్, రైతు వర్గాలతో సమావేశాలు).. అక్టోబర్, నవంబర్ లో విజయ సంకల్ప ర్యాలీలు నిర్వహించనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version