ప్రేమలో పడ్డ శ్రీముఖి.. వీడియో లీక్ అవ్వడంతో బయటపడ్డ యవ్వారం..

-

తెలుగు బుల్లితెరపై నెంబర్ వన్ యాంకర్ గా సత్తాను చాటుతున్న శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే..గ్లామర్, యాక్టింగ్, హోస్టింగ్ ఇలా ఎన్నో రకాలుగా ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ చిన్నది.. వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో తరచూ తన వ్యవహార శైలితో వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే కొంత కాలంగా శ్రీముఖి పెళ్లికి సంబంధించిన వార్తలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఓ సింగర్‌తో మాట్లాడిన ఫోన్ సంభాషణ లీకైంది.. దాంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజులో వైరల్ అవుతుంది..

యాంకర్ గానే కాకుండా వెండి తెరపై కూడా పలు సినిమాల్లో మెరిసింది..ఆ తర్వాత బిగ్ బాస్ లో కూడా అడుగుపెట్టి రన్నర్ గా నిలిచింది.. ఇప్పుడు బిజీగా షోలు చేస్తూ వస్తుంది..తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలంగా యాంకర్ శ్రీముఖి పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే దీని గురించి చాలా పుకార్లు షికార్లు చేశాయి. ఈ నేపథ్యంలో ఈ బోల్డ్ యాంకర్ ‘సరిగమప’ అనే షోలో సింగర్‌ సాయి శ్రీ చరణ్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు కలరింగ్ ఇచ్చింది. టీఆర్పీ కోసమే చేసినా.. వీళ్ల జంట బాగా హైలైట్ అయిన విషయం తెలిసిందే..

ప్రస్తుతం జీ తెలుగులో ‘సరిగమప చాంపియన్‌షిప్’ సీజన్ నడుస్తోంది. ఇందులో పాత కంటెస్టెంట్లు కూడా వచ్చారు. వారిలో సాయి శ్రీ చరణ్ కూడా ఉన్నాడు. ఇక, వచ్చే వారం జరగనున్న ఫేస్ ఆఫ్ ఛాలెంజ్‌లో భాగంగా అతడు ‘తాళి కట్టు శుభవేళ’ అనే పాటను ఆలపించాడు. అతని పాట పై అందరూ ప్రశంసలు కురిపించారు.. అయితే అప్పుడే శ్రీముఖి కి ఫోన్ చేసి ప్రదీప్ ఇవ్వగా చరణ్‌కు ఇచ్చాడు. ఆ వెంటనే అతడు జల జల జలపాతం నువ్వు అని పాడాడు.శ్రీ చరణ్ పాడిన తర్వాత శ్రీముఖి ‘నాకు పాడాలని ఉంది కానీ.. జలుబు చేసింది’ అని చెప్పింది. తర్వాత చరణ్ ‘ఎలా ఉన్నారండి’ అన్నాడు. దానికి శ్రీముఖి ‘షడన్‌గా రెస్పెక్ట్ ఇస్తున్నావేంటి? మామయ్య గారు వచ్చారా షూటింగ్‌కు’ అని మాట్లాడింది. దీంతో అక్కడున్న వాళ్లందరూ షాక్ అయ్యారు… ఈ లీక్ తో శ్రీముఖి అడ్డంగా బుక్ అవ్వడం మాత్రమే కాదు.. ప్రేమలో పడిందనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. అసలు నిజమేంటో మున్ముందు తెలియనుంది..ప్రస్తుతం ఈ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతుంది..ప్రస్తుతం శ్రీముఖి వరుస షాలతో బిజీగా ఉంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version