ఆన్‌లైన్‌ చేస్తే.. నీకేం నొప్పి : పవన్‌ కళ్యాణ్‌ కు బొత్స కౌంటర్‌ :

-

రిపబ్లిక్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఆన్‌లైన్‌ అమ్మకాల విధానాన్ని డిస్ట్రిబ్యూటర్లే అడిగారని… వాళ్లకు లేని నొప్పి పవన్‌ కళ్యాణ్‌ కు ఎందుకు ? అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బొత్స. టికెట్ల ధరలు పెంచితే చూస్తూ ఊరుకోవాలా ? అని ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ. మేం సన్యాసులమైతే ఆయన రుషి పుంగవుడా ? మాకు తాట తీస్తాడా.. చూస్తామన్నారు.

ఆన్ లైన్ విధానంపై సినీ పెద్దలందరూ అంగీకరించారని… ప్రభుత్వం స్వేస్ఛ ఇచ్చింది కదా అని చెలరేగిపోతే… ఎలా కట్టడి చేయాలో మాకూ తెలుసన్నారు. సినీ పరిశ్రమ అంటే పవన్ కళ్యాణ్ ఒక్కరేనా.? అని నిలదీశారు. మంత్రి వర్గం చేర్పులు మార్పులు, కూర్పులు ఉంటే అది పూర్తిగా ముఖ్యమంత్రి ఇష్టంపై ఆధారిపడి ఉంటుందని… ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయానికి మేమంతా కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. గులాబ్ తుఫాన్ తీవ్రతపై ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు మంత్రి బొత్స.

Read more RELATED
Recommended to you

Exit mobile version