ఎల్లుండి కాంగ్రెస్ లోకి కన్హయ్య కుమార్.. జిగ్నేష్ మేవాని

-

దేశంలో ప్రముఖంగా వినిపించే యువనాయకులలో జెెెెఎన్ యూ విద్యార్థి నాయకులు కన్హయ్యకుమార్, జిగ్నేష్ మేవానిలు ఒకరు. ప్రస్తుతం వేరే వేరే పార్టీల్లో ఉన్న వీరిద్దరు ఎల్లుండి కాంగ్రెస్లోకి చేరనున్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రస్తుతం కన్హయ్య కుమార్ సీపీఐ పార్టీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఈయన బీహార్లోలోని బెగుసరాయ్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. మరోవైపు గుజరాత్ కు చెందిన జిగ్నేష్ మేవాని గత గుజరాత్ ఎన్నికల్లో వడగామ్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుపోందారు. గత గుజరాత్ ఎన్నికల్లో జిగ్నేష్ మేవానితో పాటు పటేల్ సామాజిక ఉద్యమనేత హార్థిక్ పటేల్ పేర్లు బాగా వినిపించాయి. ప్రస్తుతం హార్థిక్ పటేల్ గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇప్పటికే నాయకత్వ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీ గత వైభవం కోెసం ఎదురుచూస్తోంది. బీజేపీ దాటికి వరస ఎన్నికల్లో పరాభవాలు ఎదురవుతున్నాయి. ఢీలా పడిన కాంగ్రెస్ కు ఈ యువనాయకులు ఎంతమేర ప్లస్ అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version