కోడి కత్తి ఘటనలో ఈనాడు వార్తలు నీచమైనవి – మంత్రి బొత్స

-

శ్రీకాకుళం జిల్లా: విశాఖ ఎయిర్పోర్ట్ లో అప్పటి ప్రతిపక్ష నేత జగన్ పై ఒక ఉన్మాది హత్యాయత్నానికి పాల్పడ్డాడని.. నిందితుడు ఎందుకు ఈ చర్యకు పాల్పడ్డాడో విచారణ జరగాలన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబు పై అలిపిరిలో హత్యాయత్నం జరిగిందని.. అంటే అప్పుడు సానుభూతి కోసం ఆ ఘటన జరిపించుకున్నారనే అనుమానాలు వున్నాయని కౌంటర్ ఇచ్చారు.

కోడి కత్తి ఘటనలో ఈనాడు వార్తలు నీచమైనవన్నారు బొత్స. నిందితుడు, ఆయన పనిచేస్తున్న సంస్థ తెలుగుదేశం మద్దతు దారుడిదేనన్నారు. రాజకీయ స్వలాభం కోసం, డ్రామాల కోసం చంద్రబాబు మాట్లాడుతారని మండిపడ్డారు. నేను కూడా రాజకీయం కోసమే అని మీడియా ముసుగు తీసి రామోజీ రావు చెప్పాలన్నారు బొత్స. 2014లో కూడా రామోజీ రావు ఇలాంటి పనులే చేసారని.. దేవుడు అనేవాడు వున్నాడు కాబట్టే మేం గెలిచామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version