ఎన్నికల ప్రచారం నుండి రేవంత్ ను తొలగించండి: BRS

-

తెలంగాణ రాష్ట్రంలో మరో 17 రోజులలో ఎన్నికలు జరగనున్నాయి. అధికార పార్టీ BRS ఎలాగైనా గెలవాలన్న కసితో రగిలిపోతూ ప్రచారంలో హుషారుగా ఉంది. ఇక తాజాగా అధికార పార్టీ BRS లీగల్ టీం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాలకు వెళితే, ప్రచారంలో రేవంత్ రెడ్డి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని తక్షణమే ఆయనను ఎన్నికల ప్రచారం చేయకుండా తొలగించాలంటూ CEC వికాస్ రాజ్ ను కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి చేసే వ్యాఖ్యలు BRS క్యాడర్ ను రెచ్చగొట్టేలా ఉన్నాయని విజ్ఞప్తిలో తెలియచేయారు BRS లీగల్ టీం. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల కారణంగా దుబ్బాక మరియు అచ్చంపేట లో దాడులు జరిగినట్లు ఈ ఫిర్యాదు లేఖలో వికాస్ రాజ్ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ ఫిర్యాదు మీద కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి చెబ్తుతున్న వాస్తవాలను ప్రజలకు తెలియకుండా చేయడానికి BRS కుట్ర పన్నుతున్నారంటూ డిపెండ్ చేసుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version