సోనియాగాంధీని జీసస్ తో పోల్చిన రేవంత్ రెడ్డి

-

బిడ్డలు కష్టంలో ఉంటే ప్రభు జీసస్ త్యాగం చేసినట్టు.. తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ అగ్రనేత సోనియమ్మ త్యాగం చేశారని.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ సికింద్రాబాద్ లో జరిగిన తెలంగాణ క్రిస్టియన్ కమ్యూనిటీ డిక్లరేషన్ ఫర్ పొలిటికల్ పార్టీస్ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ క్రైస్తవ సంఘం ఇచ్చిన డిక్లరేషన్ ప్రజలకు ఉపయోగపడుతుందని భావిస్తున్నామని.. భవిష్యత్ లో ఈ డిక్లరేషన్ ని ఆమోదించేందుకు , కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

చరిత్రను మనం ప్రస్తావించాల్సి వస్తే.. క్రీస్తు శకం.. క్రీస్తు పూర్వం అని ప్రస్తావిస్తామని అలాగే తెలంగాణ సమస్యలను ప్రస్తావించాల్సి వస్తే తెలంగాణ వచ్చాక తెలంగాణ రాకముందు అని చెబుతానని పేర్కొన్నారు. రాష్ట్రంలో పదేళ్లుగా స్వేచ్ఛ ఉందా? మనం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి భయపడే పరిస్థితి ఉందని కేసీఆర్ సర్కార్ పై మండిపడ్డారు. కాంగ్రెస్ ఏం చేసిందని కొందరూ ప్రశ్నిస్తున్నారని ఇది కాంగ్రెస్ పై జరుగుతున్న పాశవిక దాడికి నిదర్శనమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. మణిపూర్ లో జరిగిన దాడులను చూసైనా ప్రజలు ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు. ఓడిన వారిని బానిసలు అన్నట్టుగా మోడీ ఆధిపత్యం చలాయిస్తున్నారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version