ఈ నెల 18న BRS తొలి బహిరంగ సభ.. హాజరుకానున్న ముగ్గురు సీఎంలు

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి జిల్లాల బాట పట్టనున్నారు. ఈనెల 12 నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. ఈనెల 12న కొత్తగూడెం, మహబూబాబాద్‌ కలెక్టరేట్లను సీఎం ప్రారంభించనున్నారు. 18న ఖమ్మం కలెక్టరేట్‌ శ్రీకారానికి ముహూర్తం ఖరారైంది. సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు, ప్రజాప్రతినిధులకు సీఎంవో నుంచి అధికారిక సమాచారం అందింది.

 

18న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. ఈ నెల 18న ఖమ్మం BRS సభకు మూడు రాష్ట్రాల సీఎంలు రానున్నారు.

 

కేజ్రీవాల్, భగవంత్ మాన్ , విజయన్.. మాజీ సీఎం అఖిలేష్ లకు ఆహ్వానం పంపారు తెలంగాణ సీఎం కేసీఆర్. BRS ఏర్పాటయ్యాక ఇదే..తొలి బహిరంగ సభ కావడం విశేషం. ఢిల్లీ నిర్వహించాలని అనుకున్న సభ ఖమ్మంకు మార్పు మార్చారు. అలాగే,ఖమ్మం సభ లోనే రెండో విడత కంటి వెలుగు ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా..50 లక్షల మంది కి అద్దాలు పంపిణీ చేయనున్నారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version