ఢిల్లీలో BRS ఎమ్మెల్యే & ఎంపీలు… అసలు విషయం ఇదే !

-

తెలంగాణాలో గత రెండు పర్యాయాలుగా గెలుస్తూ వస్తున్న కేసీఆర్ మరోసారి గెలవడానికి తగిన ప్రణాళికలు రచిస్తున్నాడు. అయితే ఈసారి తన విజన్ పూర్తిగా మారిపోయింది, దేశమంతటా తన పార్టీ విస్తరింపచేయాలన్న లక్ష్యంతో పార్టీ పేరును సైతం TRS నుండి BRS గా మార్చారు. అందులో భాగంగా ప్రతి రాష్ట్రంలో BRS కార్యాలయాన్ని స్టార్ట్ చేస్తున్నారు. కాగా దేశ రాజధాని ఢిల్లీ లో రేపు BRS పార్టీ ఆఫీస్ ను ప్రారంభించడానికి తలపెట్టారు. ఇప్పటికే BRS ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు ఢిల్లీ చేరుకున్నారు. కాగా రేపు మధ్యాహ్నం 12 .30 గంటలకే వసంత్ విహార్ కు చేరుకొని పూజ కార్యక్రమాలలో కేసీఆర్ పాల్గొనబోతున్నారు. ఇక సరిగ్గా మధ్యాహ్నం 12 .05 గంటలకు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.

ఆ తర్వాత కేసీఆర్ స్థానిక నాయకులు మరియు కార్యకర్తలతో మాట్లాడనున్నారు. అయితే కేసీఆర్ చేసిన జాతీయ రాజకీయాలు అన్న కాన్సెప్ట్ సక్సెస్ అవుతుందా ? రాబోయే ఎన్నికల్లో అసలు సొంత రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకుంటాడా అన్న పలు విషయాలు తేలియాలకంటే మరికొంతకాలం ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version