కూకట్ పల్లి ఆల్విన్ కాలనీలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

-

హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఆల్విన్ కాలనీలో బీటెక్ విద్యార్థినీ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు కు చెందిన శిరీష బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ జావ కోర్సులో జాయిన్ అయి గత కొన్నాళ్లుగా ఆల్విన్ కాలనీ లోని తన బంధువుల ఇంట్లో ఉంటుంది. ఈరోజు ఉదయం 10.30 గంటల ప్రాంతంలో చిన్న బాటిల్ లో పెట్రోల్ తీసుకుని ఫోర్త్ ఫ్లోర్ పైకి వెళ్ళింది.

పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది శిరీష. అరుపులు కేకలు వేయడంతో కింద పోర్షన్ లో అద్దెకు ఉన్న వారు పైకెళ్ళి చూడగా అప్పటికే పూర్తిగా మంటల్లో ఉన్న శిరీష కాలిపోతుంది. వెంటనే దుప్పటి తో అర్పేసి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. 108 కి ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చేలోపే శిరీష మృతి చెందింది. ఆత్మహ్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలిసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం శిరీష మృత దేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version