చంద్రబాబు ప్రభుత్వంలో నా మాటకు విలువే లేదు – బుద్దా వెంకన్న

-

చంద్రబాబు ప్రభుత్వంలో నా మాటకు విలువే లేదన్నారు బుద్దా వెంకన్న. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కార్యాలయంలో ఘనంగా ఎంపి కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న కీలక కామెంట్స్ చేశారు. పదవి లేక పోవడంతో ప్రజలకు, నన్ను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేక పోతున్నానని.. సీఐ ల ట్రాన్ఫర్స్ విషయంలో ఎమ్మెల్యే ల మాట నెగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు.

budda venkanna about chandrababu ap

ఎమ్మెల్యే ఎవరిని అడిగితే వారిని సీఐ లుగా నియమించారు…. నా మాట చెల్లలేదు…ఆవేదన గా ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఇతరుల మీద ఆధారపడ్డను… ఇంకా నన్ను నమ్ముకున్న వారికి నేనేమీ చేస్తాను…నన్ను కార్యకర్తలు క్షమించాలని అంటూ సంచలన వ్యాక్యలు చేశారు. 2024 ఎన్నికల సందర్భంలో రక్తంతో చంద్ర బాబు నాయుడు చిత్ర పటం కాళ్ళు కడిగాను… నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా బాధపడలేదని ఎమోషనల్‌ అయ్యారు బుద్దా వెంకన్న.

Read more RELATED
Recommended to you

Exit mobile version