అమల్లోకి CAA.. దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేసిన కేంద్రం

-

త్వరలోనే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వివాదస్పదమైన ‘పౌరసత్వ సవరణ చట్టం-2019’ ను అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో.. దేశంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ,ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను రంగంలోకి దించింది.

పౌరసత్వ సవరణ చట్టం-2019 కోసం త్వరలో అందుబాటులోకి తెచ్చే పోర్టల్లో పౌరసత్వం కోసం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం బాధితులను కోరింది.ఈ చట్టం 2014 డిసెంబరు 31 కంటే ముందు ఆఫ్ఘనిస్తాన్ ,పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. ఈ చట్టంలో ముస్లింలను మినహాయించడంపై వివాదం రాజకుంది.1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ ప్రభుత్వం సవరణలు చేసి 2019లో చట్టంగా మార్చింది. అయితే పౌరసత్వం ఇచ్చేందుకు మతాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం దేశంలో ఇదే మొదటిసారి.

Read more RELATED
Recommended to you

Exit mobile version