అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు తెలంగాణ హైకోర్టులో ఊరట

-

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అవినీతి కేసులో ఆమెకు CBI కోర్టు గతంలో ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సీబీఐ కోర్టు ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ఇక ఏపీలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీకి అనుమతించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి రుణం పొందారనే కేసులో CBI కోర్టు గీత, ఆమె భర్తతో పాటు మరో ఇద్దరికి 2022లో ఐదేళ్ల శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

కాగా, కొత్తపల్లి గీత అరకు నియోజకవర్గం నుంచి 2014లో వైసీపీ నుంచి ఎంపీగా బరిలోకి దిగి విజయం సాధించారు. ప్రస్తుతం కొత్తపెళ్లి గీత బీజేపీలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version