యు ట్యూబ్ లో దూసుకెళ్తున్న “కెప్టెన్ మిల్లర్” టీజర్ … !

-

గత రాత్రి తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం కెప్టెన్ మిల్లర్ టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ధనుష్ పుట్టినరోజును పురస్కరించుని చిత్ర బృందం ఈ టీజర్ ను రిలీజ్ చేసింది, అంచనాలు పెట్టుకున్న విధంగానే ఈ టీస్వర్ యు ట్యూబ్ లో సంచలనాలను సృష్టిస్తోంది. రాత్రి 12 గంటలకు విడుదలైన ఈ టీజర్ కేవలం 12 గంటల్లోనే 10 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోవడం విశేషం. దీనితో ధనుష్ ఫ్యాన్స్ ఆనందంతో రెచ్చిపోతున్నారు, కాగా ఈ సినిమా పీరియోడికల్ డ్రామాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో ధనుష్ నమ్ముకున్న ప్రజల హక్కుల కోసం పోరాడే ఒక వీరుడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో సందీప్ కిషన్, శివరాజ్ కుమార్, ప్రియాంక అరుళ్ మోహన్ లు తదితర పాత్రలలో నటిస్తున్నారు.

మరి సినిమా రిలీజ్ తేదీ కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. యు ట్యూబ్ లో దూసుకెళ్తున్న “కెప్టెన్ మిల్లర్” టీజర్ … !

Read more RELATED
Recommended to you

Exit mobile version