మద్యంతో తిరుపతి లడ్డూను పోల్చినందుకు చంద్రబాబుపై కేసు..

-

జగన్ ప్రభుత్వ విధానాలతో ప్రజలకు నష్టం కలుగుతుందని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే హిందువులు పరమ పవిత్రంగా స్వీకరించే తిరుమల లడ్డూను మద్యంతో పోల్చినందుకు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబునాయుడిపై కేసు నమోదైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మద్యం ధరలను పెంచినట్టుగానే, తిరుమల లడ్డూ ప్రసాదం ధరలను పెంచుతున్నారని, పేదలకు లడ్డూను దూరం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించిన సంగతి తెలిసిందే.

మద్యం నిషేధం చేస్తామంటూ ధరలను పెంచుతున్నారని, అలాగే తిరుమలకు భక్తులు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో లడ్డూ ధరలను, రూముల ధరలను పెంచుతున్నారని ఆయన అన్నారు. దీంతో ఆయనపై తిరుపతి పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version