టీడీపీ నేత హత్య కేసును ఛేదించిన పోలీసులు

-

అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం మందినేని వడ్డెపల్లెలో ఈనెల 02వ తేదీన జరిగిన తెలుగుదేశం పార్టీ నేత తిరుపతి వారాధి (77) హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య జరిగిన రోజు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన ఆ ఘటన పై ఆరా తీశారు. నిందితులను వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి పోలీసులను ఆదేశించారు. పోలీసులు ఎట్టకేలకు ఇద్దరూ నిందితులను అరెస్ట్ చేశారు.

సంబేపల్లి మండలం దుద్యాల గ్రామానికి చెందిన తిరుపతి వారాధి(77) కొన్నేళ్ల క్రితం ముదినేనివడ్డెపల్లె కు వచ్చి స్థిరపడ్డారు. గ్రామంలో ప్రజలకు అవసరమైన పనులు చేసి పెడుతూ వస్తుండేవారు. ఇటీవల ఉపాధి హామీ పథకం కింద రూ.5లక్షల పనులు చేయించేందుకు కాంట్రాక్టు పనులు దక్కించుకున్నాడు. రహదారి నిర్మాణానికి మరో 49లక్షల విలువైన పని వచ్చిందని స్తానికులకు చెప్పారు. దీంతో అదే గ్రామానికి చెందిన మదనపల్లి చిన్నికృష్ణ, బంగారువాండ్లపల్లెకు చెందిన యోగానందరెడ్డి కాంట్రాక్టు పనుల కోసం పోటీ పడుతున్నారు. వారు తిరుపతి వారాధిపై ద్వేషం పెంచుకొని బండరాయితో కొట్టి చంపినట్టు తమ విచారణలో తేలిందని రాయచోటి సీఐ వరప్రసాద్ వెల్లడించారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version