సినిమాల్లోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఎంట్రీ..

-

వాసగిరి లక్ష్మీనారాయణ కర్నూలు జిల్లాకు చెందిన మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి. డిఐజి హోదా లో ఉన్నప్పుడే కేంద్రానికి డిప్యూటేషన్ పై వెళ్లి సిబిఐ లో బాధ్యతలు చేపట్టారు. సిబిఐ డిఐజి గా 2006 జూన్ లో సొంత రాష్ట్రమైన హైదరాబాద్ లో విధుల్లో చేరారు. ఈయన సంచలనాత్మక కేసుల దర్యాప్తునకు చిరునామాగా మారిన సిబిఐ హైదరాబాద్ విభాగం జాయింట్ డైరెక్టర్.

సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రియల్ లైఫ్ క్యారెక్టర్ లోనే ఆయన నటించినట్లు తెలుస్తోంది. లక్ష్మీనారాయణతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకుల ప్రొఫెసర్ నాగేశ్వరరావు, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కూడా స్క్రీన్ పై కనిపించనున్నారు.

రమేష్ చెప్పాల డైరెక్షన్ లో భీమదేవరపల్లి బ్రాంచి అనే మూవీతో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, అద్దంకి దయాకర్ రావు యాక్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రమేష్ చెప్పాల మాట్లాడుతూ, గతంలో సిబిఐ జెడిగా పనిచేసిన వివి లక్ష్మీనారాయణ తమ సినిమాలో నటించారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version