Kavitha: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్..రెండు తెలుగు తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తున్న విషయం తెలిసిందే..ఈ స్కామ్‌లో రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు ఉన్నారని కథనాలు వచ్చాయి. ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బంధువు, అరబిందో డైరక్టర్ శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు.

అలాగే ఈ స్కామ్‌లో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా వచ్చింది. అటు తెలంగాణలో కేసీఆర్ కుమార్తె కవిత పేరు ఎప్పటినుంచో వినిపిస్తుంది. ఇక తాజాగా టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు కూడా ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో 160 సీఆర్‌పీసీ కింద వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది సిబిఐ. కేవలం వివరణ కోసం మాత్రమే నోటీసు ఇచ్చినట్లు సీబీఐ పేర్కొంది. దీంతో టిఆర్ఎస్ పార్టీ లో కలకలం రేపుతోంది,

Read more RELATED
Recommended to you

Exit mobile version