బ్యాంకు కి షాక్ ఇచ్చిన కేంద్రం…!

-

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లక్ష్మీ విలాస్ బ్యాంకు కి షాక్ ఇచ్చింది. ఈ ఏడాది డిసెంబర్ 16 వరకు లక్ష్మి విలాస్ బ్యాంక్‌ ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాత్కాలిక నిషేధంలో ఉంచినట్లు ఆర్‌బిఐ మంగళవారం ఒక ప్రకటన చేసింది. రిజర్వ్ బ్యాంక్ విజ్ఞప్తి మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం సంచలనం అయింది. గత మూడేళ్లుగా లక్ష్మి విలాస్ బ్యాంక్ ఆర్థిక స్థితిలో ఎక్కువ క్షీణత ఉంది అని వెల్లడించారు.

తాత్కాలిక నిషేధం వెంటనే అమల్లోకి వచ్చింది. ప్రైవేటు యాజమాన్యంలోని లక్ష్మి విలాస్ బ్యాంక్ కస్టమర్ల విత్ డ్రాకి ప్రస్తుతం రూ .25 వేల పరిమితి విధించారు. లక్ష్మి విలాస్ బ్యాంక్ తన నికర విలువను తగ్గిస్తోందని ఆర్బిఐ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఎటువంటి ఆచరణీయమైన వ్యూహాత్మక ప్రణాళిక లేకపోవడం, పురోగతి క్షీణించడం మరియు నిరర్ధక ఆస్తులను (ఎన్‌పిఎ) పెంచడం వంటి కారణాలతో తాత్కాలిక నిషేధాన్ని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version