టన్నెల్ లోపల ఘటనపై కీలక పరిణామం చోటు చేసుకుంది. టన్నెల్ లోపల ఘటనా స్థలం వద్దకు సహాయక బృందాలు చేరుకున్నాయి. టన్నెల్ లోపల ఘటనా స్థలం వద్దకు చేరుకున్నాయి సహాయక బృందాలు. పైప్ లైన్స్ అన్ని చెల్లాచెదురైపోయి.. బురద మొత్తం కూరుకుపోయి.. అత్యంత భయానకంగా తయారయ్యాయి టన్నెల్ లోపలి పరిస్థితులు. దీంతో కూలిన స్థలంలో క్లియర్ చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా… ఎస్ ఎల్ బి సి టన్నెల్ ప్రమాదంపై తాజాగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఎస్ ఎల్ బి సి టన్నెల్ లో చిక్కుకున్న ప్రాజెక్టు మేనేజర్ ఫోన్ రింగ్ అవుతోందని.. ఆయన తాజాగా మీడియాతో వెల్లడించారు. ఈ ఘటన జరిగిన రోజు ఆయన తన భార్యకు ఫోన్ కాల్ చేసి మాట్లాడినట్లు… తమకు తెలిసినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించడం జరిగింది. దీంతో మేము ఆయనకు ఫోన్ చేయగా మొదట రింగ్ అయి ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లారిటీ ఇచ్చారు. సైబర్ సెక్యూరిటీ సహాయంతో ఫోన్ ట్రేస్ చేస్తున్నామని… వివరించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
SLBC Tunnel Collapse Update:
టన్నెల్ లోపల ఘటనా స్థలం వద్దకు చేరుకున్న సహాయక బృందాలు
పైప్ లైన్స్ అన్ని చెల్లాచెదురైపోయి.. బురద మొత్తం కూరుకుపోయి..
అత్యంత భయానకంగా తయారైన టన్నెల్ లోపలి పరిస్థితులు#SLBCTunnel #SLBCTunnelCollapse #Nagarkurnool #Telangana pic.twitter.com/PCQSnAj8Vi
— PulseNewsBreaking (@pulsenewsbreak) February 25, 2025