నాకు ప్రాణహాని ఉంది : చల్లా శ్రీలక్ష్మి సంచలనం

-

 

దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణ రెడ్డి ఇంటి పంచాయితీ ఇంకా కొనసాగుతోంది. తాజాగా చల్లా శ్రీలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేసారు. నాకు ప్రాణహాని ఉందని బాంబ్‌ పేల్చారు చల్లా శ్రీలక్ష్మి. ప్రజలు తన వెంట వస్తున్నారని సహించలేకపోతున్నారన్నారు చల్లా శ్రీలక్ష్మి.

నాపై , నా అనుచరులపై దాడులు చేశారు… నేను అవుకు వదిలి వెళ్లిపోవాలని ఇలా చేస్తున్నారని పేర్కొననారు. నేను అవుకులోనే ఉంటా….ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు.. నా రాజకీయ భవిష్యత్తు జగన్ చేతుల్లోనే ఉందని చెప్పారు చల్లా శ్రీ లక్ష్మి. మా కుటుంబంపై కేసులు పెట్టె పరిస్థితి రావడం బాధాకరం అని వివరించారు చల్లా శ్రీలక్ష్మి.

చల్లా కుటుంబం లో గొడవలకు శ్రీలక్ష్మి కారణం అని అటు చల్లా పృథ్వి పేర్కొన్నారు.  మా నాన్న ఫోటోను తీసుకుంటే శ్రీలక్ష్మి రాద్ధాంతం చేసిందన్నారు చల్లా పృథ్వి.  చల్లా శ్రీలక్ష్మి ఆఫీస్ ఆమె సొంతం ఎలా అవుతుంది….మా అమ్మకు హక్కు లేదా అని నిలదీశారు చల్లా పృథ్వి.

Read more RELATED
Recommended to you

Exit mobile version