చంద్రముఖి మ‌ళ్లీ వ‌చ్చేస్తుందిగా..

-

తమిళనాట 175 రోజులపాటు నిరంతరాయంగా ఆడి సరికొత్త రికార్డును తన పేరిట రాసుకుంది ర‌జినీ కాంత్ చంద్రముఖి చిత్రం. కేవలం తమిళనాట మాత్రమే కాకుండా విడుదలైన ప్రతిభాషలోనూ విజయఢంకా మోగించింది. ఇక రజనీకాంత్‌ చెప్పే ‘లకలకలకలక..’ డైలాగ్‌ ఇప్పటికీ చాలామంద నోట్లో నానుతూనే ఉంది. ఈ సినిమాలో తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, నయనతార, జ్యోతిక, ప్రభు, నజీర్‌, వడివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. 2005లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చెక్కు చెదరకుండా నిలిచింది. అయితే ఈ హారర్‌ మూవీకి సీక్వెల్‌ వస్తే బాగుండనేది ఎంతోమంది ప్రేక్షకుల కోరిక. ఎట్టకేలకు ఆ కోరిక నెరవేరే సమయం ఆసన్నమైనట్టు తెలుస్తోంది.

 

తమిళ దర్శకుడు పి.వాసు మాటలు బ‌ట్టీ మ‌ళ్లీ మ‌నం చంద్ర‌ముఖి సీక్వెల్ చూడ‌బోతున్నాం. చంద్రముఖి సినిమాతో ట్రెండ్‌ సెట్‌ చేసిన పి.వాసు దానికి సీక్వెల్‌ తీస్తున్నానని ప్రకటించాడు. దీనికి సంబంధించిన స్ర్కిప్ట్‌ దాదాపుగా సిద్ధమైనట్టేనని పేర్కొన్నాడు. ఈ సినిమాకోసం ప్రముఖ నిర్మాణ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. అయితే సీక్వెల్‌లో రజనీకాంత్‌ కనిపిస్తారా, లేదా అన్న విషయాన్ని మాత్రం ఆయన దాటవేశారు. ఇక త్వరలోనే నటీనటులను వెల్లడించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version