మంత్రి మేక‌పాటికి చెల్లుబోయిన నివాళి

-

విజయవాడ : గొల్లపూడి బీసీ భవన్ లో మంత్రి మేక‌పాటి గౌతం రెడ్డికి  మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ నివాళులు అర్పించారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..నా సహచర మిత్రుడు,మృదు స్వభావి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆక‌స్మిక మ‌ర‌ణ వార్త చాలా బాధ కలిగించింది.ఎంతో ఆప్యాయంగా అన్నా అంటూ పలకరిస్తూ,ఎంతో ఉత్సాహంగా ఉండే ఆయ‌న ఇక లేరు అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను.ఐటీ,పరిశ్రమల శాఖకు వన్నె తెచ్చిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి..ముఖ్యమంత్రి ఆశయా లకు అనుగుణంగా ప‌నిచేశారు.

తనకు అప్ప‌గించిన ప‌నుల‌ను ఎంతో నిబద్ధతతో పూర్తిచేశారు.మా వైఎస్సార్సీపీ కుటుంబం ఓ మం చి నాయకుడిని కోల్పోయింది.పార్టీలో కూడా చాలా కీలకంగా వ్యవహరించారు.నా రాజకీయ ఎదుగుదలకు మేకపాటి కుటుంబం ఎంతో తోడ్ప‌డింది.ప్రోత్స‌హించింది.మా బీసీలకు చెందిన జౌళీ శాఖకు కూడా మంత్రిగా ఉంటూ,నేతన్నలకు ఎంతో ప్రోత్సాహక‌రంగా ఉన్నారు.చిన్న వయస్సులోనే ఎన్నో బృహత్తర కార్యక్రమాలు నిర్వహించిన నా సహచర మిత్రుడి లేని లోటు ఎవరు తీర్చలేనిది. వారి మృతికి సంతాపం తెలుపుతూ..వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను అని అన్నారాయ‌న‌. కార్య‌క్ర మంలో  13 జిల్లాలకు చెందిన 56 బీసీ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version