ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన వాయిదా

-

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కర్నూలు పర్యటన వాయిదా పడింది. ఈ నెల 4న కర్నూలు జిల్లా బనగానపల్లెలో సీఎం జగన్ పర్యటించాల్సి ఉంది. ఇప్పటికే మంత్రి బుగ్గన ఏర్పాట్లు కూడా చేశారు.అయితే అనివార్య కారణాల వల్ల ముఖ్యమంత్రి జగన్ పర్యటన వాయిదా పడినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు మరో రోజు ఖరారు చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన షెడ్యూల్‌ను ప్రకటిస్తామని తెలిపారు.

కాగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. రాబోయే పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ సీట్లు గెలిచే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం జగన్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఆయన పలు జిల్లాల్లో పర్యటించారు. ఈ షెడ్యూల్‌లో భాగంగా ఈ నెల 4న కర్నూలు జిల్లాలో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయాలని ప్లాన్ చేశారు. కానీ అనుకోకుండా సీఎం జగన్ కర్నూలు టూర్‌ను వాయిదా వేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version