సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన చిన జీయర్ స్వామి

-

ఆధ్యాత్మిక గురువు చిన జీయర్ స్వామి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ముచ్చింతల్లో సమతాకుంభ్ ఉత్సవాలకు రావాలని రేవంత్ రెడ్డి ని ఆయన ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రామానుజ జీవిత విశేషాలను చిన జీయర్ వివరించారని సమతాకేంద్ర వర్గాలు తెలిపాయి. ఆయన విజ్ఞప్తికి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

భేటీ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేగంపేట విమానాశ్రయము నుంచి ఢిల్లీకి వెళ్లారు .ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. సీఎం రేవంత్ వెంట భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులు ఉన్నారు. అయితే గతంలో రామానుజచార్య విగ్రహం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కాగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గైర్హాజరైన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version