ఒలింపిక్స్ : నిరాశపరిచిన భారత బ్యాడ్మింటన్ జోడీ..!

-

ఒలింపిక్స్ లో భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విన్ సాయి రాజ్, చిరాజ్ శెట్టి నిరాశపరిచారు. పురుషుల డబుల్స్ క్వాటర్ ఫైనల్స్ లో మలేషియా జోడీ చేతిలో ఓటమితో వెనుదిరిగారు. అయితే ప్యారిస్ ఒలంపిక్స్ ప్రారంభానికి ముందు వరకు ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ భారత జోడీపై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. తప్పకుండ వీరు మెడల్ కంటెండర్స్ అని ప్రతి ఒక్కరు అనుకున్నారు.

ఆ విధంగానే గ్రూప్ స్టేజిలో అదరగొట్టిన ఈ రోజు క్వాటర్ ఫైనల్స్ లో కూడా 21-13 తో మొదటి సెట్ ను సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత వరుసగా 14-21, 16-21 తేడాతో రెండు సెట్స్ ఓడిపోయి మ్యాచ్ ను మలేషియాకు ఇచ్చేసారు. అయితే ఈ మ్యాచ్ లో చిరాజ్ శెట్టి సర్వ్ లో తప్పిదాలు చేస్తూ.. కొంచెం తొందరపాటును కనబరిచాడు. అదే ఇండియాకు పెద్ద దెబ్బ వేసింది అని చెప్పాలి. క్వాటర్ ఫైనల్స్ లో ఓడటంతో ఈ జంట మెడల్స్ రేస్ నుండి బయటకు వచ్చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version